అనారోగ్య సమస్యలే కారణమంటూ సోషల్ మీడియాలో పోస్ట్
దేశవిదేశాల్లో 7,398 కార్యక్రమాలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన మోటివేటర్ జీవితం విషాదాంతం
నిజాంసాగర్లో దూకి బలవన్మరణం
నిజాంసాగర్, జనవరి24: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్రెడ్డి (34) ఆత్మహత్య చేసుకున్నాడు. పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన జైపాల్రెడ్డి సోమవారం ఉద యం ఆరుగంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజె క్టు గోల్బంగ్లా సమీపంలో ప్రాజెక్టులో దూకాడు. అత్మహత్య చేసుకునే ముందు తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఫేస్బుక్, వాట్సాప్లో పోస్టులు పెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా తాను తీవ్రమైన గ్యాస్ట్రిక్, ఆర్శమొలల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానన్నారు. 18 సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు కుటుంబ సభ్యులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారని తెలిపాడు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, తనకు శత్రువులు కూడా లేరన్నారు. ఆరోగ్య సమస్యతో మాత్ర మే ఆత్మహ త్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అతడి మిత్రులు, కుటుంబీకులు వెంటనే ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఎస్సై సయ్యద్ అహ్మద్ అక్కడికి చేరుకొని జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో జైపాల్రెడ్డి మృతదేహం లభించింది. మృతు డి సోదరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించామని ఎస్సై తెలిపారు.
ధైర్యం చెప్పేవాడే.. అధైర్య పడ్డాడు..!
ఎంతో మంది విద్యార్థులతో పాటు తోటి వారికి సైతం వ్యక్తిత్వ వికాస ప్రసంగాల ద్వారా జైపాల్రెడ్డి ఉత్తేజాన్ని నింపారు. సుమారు 7,398 కార్యక్రమాలను నిర్వహించారు. ఫేస్బుక్తో పాటు సోషల్ మీడియా ద్వారా ఎందరినో ఉత్తేజపరిచి వారిలో ధైర్యాన్ని నింపాడు. ఇతర జిల్లా లు, రాష్ర్టాలు, విదేశాల్లో సైతం తన ప్రసంగాలతో చాలామంది జీవితాల్లో వెలుగును ప్రసాదించా రు. చివరకు అనారోగ్య కా రణంతో ఆత్మహత్య చేసుకొని అందరిలో విషాదాన్ని నింపారు. జైపాల్రెడ్డి మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని చాలామంది దుఃఖ సాగరం లో మునిగిపోయారు.