మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 21 : జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిములు బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం కొత్త బట్టలు ధరించి మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అనంతరం ఇండ్ల వద్ద ఖుర్బానీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ముస్లిములకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డిలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబుద్దీన్కు టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పుష్పగుచ్ఛాన్ని అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి షబ్బీర్అలీకి కాంగ్రెస్ నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్, కో-ఆప్షన్ సభ్యుడు మాసుల లక్ష్మీనారాయణ, నాయకులు గెరిగంటి లక్ష్మీనారాయణ, సంగి మోహన్, పండ్ల రాజు, గోనె శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాన్సువాడలోని ఈద్గాల వద్ద ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బీర్కూర్లో ముస్లిములు కొత్త బట్టలను ధరించి ఈద్గాల వద్ద నిర్వహించిన సామూహిక నమాజ్లో పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి, దుర్కి, నాచుపల్లి, బొమ్మన్దేవ్పల్లి, నస్రుల్లాబాద్ తదితర గ్రామాల్లో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని జామా, ఉస్మానియా, కరీమా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జామియా మసీదులో సదర్ షేక్ గయాజొద్దీన్ పండుగ విశిష్టతను వివరించారు. ఎల్లారెడ్డిలో వర్షం ఎక్కువగా కురియడంతో ఇండ్లలోనే ప్రార్థనలు నిర్వహించారు.
గాంధారి మండలం గండివేట్లో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ అబ్దుల్ ఫారూఖ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, షాదుల్, అశ్వాఖ్, గౌస్, హైమద్, ముల్తాన్, జుబేర్ పాల్గొన్నారు. లింగంపేటలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురవడంతో ఈద్గాల వద్ద కాకుండా ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సదాశివనగర్లో బుధవారం ఉదయం ఈద్గాల వద్ద ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి, కల్వరాల్, ధర్మారావుపేట్, కుప్రియాల్, పద్మాజివాడి ఎక్స్రోడ్డు గ్రామాల్లో బక్రీద్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోహినుద్దీన్, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు మహ్మద్ దస్తగిరి, పద్మాజివాడి విండో మాజీ చైర్మన్ ఫక్రుద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహ్మద్ షషీయొద్దీన్, లెక్చరర్ సలావుద్దీన్ పాల్గొన్నారు.
నిజాంసాగర్లోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు ముస్లిముల ఇండ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుల్తాన్నగర్లో సర్పంచ్ అమీనాబీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్నగర్లో సొసైటీ చైర్మన్ వాజిద్అలీ, తున్కిపల్లిలో నాయకులు మోహిజ్, ఆమేర్, కోమలంచలో కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, మగ్ధుంపూర్లో బషీర్, మల్లూర్లో బాబు, వడ్డేపల్లిలో గోరేమియా ఇండ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు. పిట్లంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపారు.
మద్నూర్లో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దరాస్ సూర్యకాంత్ పాల్గొని ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నశక్కర్గలో సర్పంచ్ గఫార్, శేఖాపూర్లో సర్పంచ్ ఎంకేపటేల్, మేనూర్లో మండల కో-ఆప్షన్ సభ్యుడు నిజామొద్దీన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.