కొచ్చి, జూలై 9: డ్రోన్లపై భారత నావికాదళం నిషేధం విధించింది. నేవీ యూనిట్లు, స్థావరాల నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో వాటిని ఎగురవేయడాన్ని నిషేధించినట్టు శుక్రవారం పేర్కొంది. ఒకవేళ ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే డ్రోన్లను ధ్వంసం చేయడమో లేక జప్తు చేయడమో చేస్తామని, అలాగే నిందితులపై కఠిన చర్యలుంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జమ్ముకశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో నేవీ ఈ నిర్ణయం తీసుకుంది.