న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ యాక్టివేట్ కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సీబీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే, మంటలు వెలుడవలేదని, ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. కొన్ని గంటల్లోనే మళ్లీ కార్యాలయం పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.