ముంబై : వినాయక చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో 72 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు సెంట్రల్ రైల్వే విభాగం తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ-2టైర్, ఏసీ-3టైర్, 11 స్లీపర్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ సీటింగ్ కంపోజిషన్ ఉంటుందని పేర్కొంది. 01227/01228 నంబరు గల సీఎస్టీఎం – సావంత్వాడి రోడ్ డైలీ స్పెషల్ ట్రైన్ (36 ట్రిప్పులు), 01229/ 01230 నంబరు ట్రైన్ సీఎస్ఎంటీ-రత్నగిరి బై వీక్లీ స్పెషల్ (10 ట్రిప్పులు), 01231/01232 ట్రైన్ పన్వెల్-సావంత్వాడి రోడ్ ట్రై-వీక్లీ స్పెషల్ (16 ట్రిప్పులు), 01233/01234 నంబరు గల ట్రైన్ పన్వెల్-రత్నగిరి బై వీక్లీ స్పెషల్ (10 ట్రిప్పులు) నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఆయా ట్రైన్లకు సంబంధించి టికెట్ల బుకింగ్ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని, అన్ని పీఆర్ఎస్ కేంద్రాల్లో, రైల్వే వెబ్సైట్ www.irctc.co.in చేసుకోవచ్చని తెలిపింది. ప్రయాణ సమయంలో కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. టికెట్లు ఉన్న ప్రయాణికులకు మాత్రమే రైళ్లలో ఎక్కేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.