శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన ఢీ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో శ్రీను వైట్ల క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా డి అండ్ డి అనే సినిమాను గత ఏడాదే ప్రకటించారు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది. అయితే ఈ సినిమా పలు కారణాల వలన ఆగిపోయిందని రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు శ్రీను వైట్ల.
గ్యాప్ వచ్చిందని అందరు అనుకుంటున్నారు. కాని అందులో నిజం లేదు. కరోనా వలన వెంటనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయాం. అయితే ఆ గ్యాప్లో రెండు స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నా. నిర్మాతలు కూడా రెడీ అయ్యారు. ముందుగా అనుకున్న ప్రకారం డి అండ్ డి ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లాలి. కాని వచ్చే నెల 2వ వారం తర్వాత స్టార్ట్ చేయాలని భావిస్తున్నాము.
‘ఢీ’ సినిమా పూర్తిస్థాయి వినోదభరితం చిత్రం. ‘డి అండ్ డి’ అంతకు మించి ఉంటుంది. అందుకే ఈ సినిమాకి ‘డబుల్ డోస్’ అనే క్యాప్షన్ పెట్టాము. నేను రెడీ చేసుకున్న రెండు కథలను కూడా వెంటనే మొదలు పెడతాను. అయితే ఏ హీరో నా కథకు నచ్చుతారో చూసి సెలక్ట్చేస్తాను. ఇవి కూడా నవ్వించేవే అని శ్రీను వైట్ల అన్నారు.