-బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా
గ్వాలియర్, జూన్ 21: కాంగ్రెస్ పార్టీ తన పేరు మార్చుకుని తిరిగి ప్రజల వద్దకు వెళ్లాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గ్వాలియర్ పేరును మార్చాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం గ్వాలియర్లో సింధియా మాట్లాడుతూ.. ‘ఒకవేళ గ్వాలియర్ పేరు మార్చాలనే ఆసక్తి కాంగ్రెస్కు ఉంటే ముందు ఆ పార్టీ పేరును మార్చుకుని ప్రజల వద్దకు వెళ్లాలి. వారి హృదయాల్లో స్థానం ఏర్పరుచుకోవాలి’ అని సూచించారు. గ్వాలియర్ పేరును ‘మహారాణి లక్ష్మీభాయ్ నగర్’గా మార్చాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది బీజేపీలో చేరడానికంటే ముందు సింధియా చాలాకాలం కాంగ్రెస్లో ఉన్న విషయం తెలిసిందే.