వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలి

డీఎస్పీ జైపాల్రెడ్డి
బాన్సువాడ / నిజాంసాగర్/నాగిరెడ్డిపేట్, జనవరి 24 : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో వాహనదారులకు ఆదివారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, సెల్ఫోన్లో మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడుపవద్దని సూచించారు. అనంతరం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే నిర్వహించారు. హెల్మెట్ ధరించని వారికి రోజా పువ్వులను ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సాయన్న, టౌన్ సీఐ రామకృష్ణ, పోలీసు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంసాగర్లో పోలీసు కళాజాత బృందం ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎంవీఐలు పవన్కుమార్, విజేంద్రరెడ్డి ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాజాత బృందం సభ్యుడు పవన్కుమార్, ఎస్సై హైమద్, సిబ్బంది ప్రసాద్, రాజు, గంగారాం పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్లో ఎస్సై రాజయ్య వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించారు.
తాజావార్తలు
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- మరోసారి బుల్లితెరపై సందడికి సిద్ధమైన రానా..!
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య