సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): ఓ బాలికను వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తల్లి.. తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభ్యంతకరమైన మెసేజ్లను పంపిస్తూ వేధిస్తున్నాడని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి ఈ మెసేజ్లను పంపించింది మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సయ్యద్ సైఫుద్దీన్ అని నిర్ధారించుకుని శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో సయ్యద్ సైఫుద్దీన్ 10వ తరగతి చదువుతున్న సమయంలో తన సోదరి స్నేహితురాలు పరిచయమైంది. ఆమెతో స్నేహం చేశాడు. ఈ సందర్భంలో బాలికతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాలిక తల్లి పాఠశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్ అప్పుడు అతన్ని మందలించాడు. ఇది మనస్సులో పెట్టుకుని సయ్యద్ సైఫుద్దీన్.. ఇన్స్టాగ్రామ్ ద్వారా నకిలీ ఐడీలతో బాలికను వేధించాడని తేలింది.