జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలి

బాన్సువాడ రూరల్/ నిజాంసాగర్/ బీబీపేట్ : మేకలు, గొర్రెలు రోగాల బారిన పడకుండా నట్టల నివారణ మందును వేయించాలని పశువైద్యుడు సతీశ్ పాడి రైతులకు సూచించారు. బాన్సువాడ మండలంలోని బోర్లంలో మేకలు, గొర్రెలకు ఆయన గురువారం నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి, ఉపసర్పంచ్ మంద శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవేందర్రెడ్డి, నాయకులు సాయిలు, గంగ హన్మాండ్లు పాల్గొన్నారు.
జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బాలమణి, పశువైద్యాధికారి వినీత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయినాథ్, సిబ్బంది జైపాల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండలంలోని రాంరెడ్డిపల్లిలో జీవాలకు పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందు వేశారు. మొత్తం 2,400 గొర్రెలు, మేకలకు మందులు వేశామని పశువైద్య సిబ్బంది తెలిపారు. వారి వెంట పాడి రైతులు, గ్రామపెద్దలు ఉన్నారు.
తాజావార్తలు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్కు టీకాలు.. భారత్ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ