హైదరాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 1 నుంచి గురువారం వరకు మొత్తం 5,35,241 కేసులు నమోదు చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇందులో మాస్క్లు సరిగా ధరించనివారిపై 3,65,934 కేసులు నమోదు చేసి, రూ.32.18 కోట్ల జరిమానాలు విధించారు. లాక్డౌన్ ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదంటూ ఇప్పటికే హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ ప్రకటనలు, వీడియోలు విడుదల చేశారు. అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లాలు, డివిజన్ల పరిధిల్లో పోలీస్ ఉన్నతాధికారులు వాహన తనిఖీల్లో పాల్గొంటూ లాక్డౌన్పై అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా తిరిగే ఆకతాయిలకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. వాహనాలకు గతేడాది ఇచ్చిన ఎమర్జెన్సీ పాస్లను, మీడియాలో పనిచేయకుండానే ప్రెస్ స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతున్నవారిపై చీటింగ్ కేసులు బుక్ చేస్తున్నారు.
ఈ నెల 12 నుంచి గురువారం వరకు కేవలం తొమ్మిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,47,485 కేసులు నమోదు చేశారు. ఇందులో మాస్క్లు సరిగా ధరించకుండా బయటికొచ్చిన 45,559 మందిపై కేసులు నమోదు చేసి, రూ.2.78 కోట్ల జరిమానా విధించారు.