ఆర్మూర్, మే 17: పేదలకు సీఎంఆర్ఎఫ్తో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత అన్నారు. ఆర్మూర్ బల్దియా కార్యాలయంలో, పట్టణంలోని పలు వార్డుల్లో, మండలంలోని ఆలూర్ గ్రామంలో పలువురు బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం అందజేశారు. ఆర్మూర్ మున్సిపల్లో 109 మందికి చెక్కులను అందజేశారు. మున్సిపల్లోని 12వ వార్డులో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి స్థానిక కౌన్సిలర్ తాటి హన్మాండ్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మండలంలోని దేగాంలో 11 మందికి, ఆలూర్లో 15 మందికి చెకుకలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే జీవన్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ మోతె భోజకళాచిన్నారెడ్డి, సర్పంచులు కల్లెం మోహన్రెడ్డి, గడ్డం సరోజ, ఉపసర్పంచులు దుమ్మాజీ శ్రీనివాస్, గంగారెడ్డి, ఎంపీటీసీలు ఉప్పునూతుల అనూష శ్రీనివాస్గౌడ్, మార్కంటి లక్ష్మీమల్లేశ్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మూలాకిడి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సడాక్ అరుణ్, చింతలూర్ చరణ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.