ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఎన్టీఆర్కు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పాజిటివ్ వచ్చినప్పటి నుండి ఐసోలేషన్లో ఉంటున్న ఎన్టీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడిందట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఈ రోజు ఈద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంది. త్వరలోనే నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు. కాగా, చిరంజీవి కూడా ఎన్టీఆర్కు కాల్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసారు. ఎన్టీఆర్ ఆరోగ్యంకు సంబంధించిన విషయాన్ని తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు చిరు.