న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు జాతీయ స్థాయిలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ బుధవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరారు. మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడటంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం కొవిడ్-19 ను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైనందున సుప్రీంకోర్టు కేవలం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకే పరిమితం కాకూడదని, సమాంతర జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనికోసం రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం రూ 20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.