అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ముత్తంశెట్టి మల్టీ మీడియాతో కలసి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్గా కనిపించనుండగా, రష్మిక మంధాన గిరిజన యువతిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 13న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వలన ఆగింది.
పుష్ప చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల మందుకు రానున్నట్టు కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని చిత్రనిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ కన్ఫాం చేశారు. పుష్ప చిత్రాన్ని రెండున్నర గంటలలో చెప్పలేం. అందుకే అల్లు అర్జున్, దర్శకుడు, సుకుమార్ మేం అందరం కలిసి రెండు భాగాలుగా తీయాలని అనుకున్నాం. తొలి పార్ట్ షూటింగ్ పూర్తి కాగానే రెండో పార్ట్ షూటింగ్ శరవేగంగా చేస్తాం. ఇప్పటికే రెండో భాగం షూటింగ్ పది శాతం పూర్తైంది అని రవి శంకర్ అన్నారు. ఏదేమైన బాహుబలి తర్వాత పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండడం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.