మల్యాల, మే 9 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నందున చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొండగట్టు అంజన్న స్వామికి మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం మల్యాల, కొడిమ్యాల మండలాల టీఆర్ఎస్ నాయకులతో కలిసి మెట్లదారిన పాద యాత్రగా అంజన్న సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, గత నెల 20న కట్టిన ముడుపును విప్పారు. ఆంజనేయస్వామి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్రావు, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.