చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గురుగ్రామ్తోసహా 9 జిల్లాల్లో నేటి నుంచి వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. గురుగ్రామ్, పంచకుల, ఫరీదాబాద్, సోనిపట్, రోహ్తక్, కర్నాల్, హిసార్, సిర్సా, ఫతేహాబాద్ జిల్లాల్లో వారాంతపు లాక్డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ వర్థన్ ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.