నిర్మల్ : మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కుమార్తెతో ఇవాళ మధ్యాహ్నం ప్రాజెక్టు వద్దకు వచ్చిన మాసస (26) ఎవరూ లేని సమయంలో ప్రాజెక్టులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
మానస ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి