రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, బోర్డులు, ప్రభుత్వరంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఒక గంటముందుగా అంటే 4 గంటలకే విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 14 నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.