మొన్నటి వరకు బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టించగా, ఇప్పుడు టాలీవుడ్పైన పంజా విసురుతుంది. రాను రాను కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అరవింద్, త్రివిక్రమ్, రచయిత విజయేంద్రప్రసాద్, నివేదా థామస్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ కరోనా భయంతో ఐసోలేషన్లో ఉన్నారు. దిల్ రాజుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కూడా క్వారంటైన్కు వెళ్లారు.
తాజా సమాచారం ప్రకారం ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్కు సైతం కరోనా పాజిటివ్ అని సమాచారం. ఇటీవల పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ మూవీకి సంబంధించి ఫొటో షూట్ జరుగుతుంటే అక్కడికి వెళ్లిన దిల్ రాజు ఆ పక్కనే శాకుంతలం చిత్రీకరణ జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి గుణశేఖర్ను కలిసాడు. దీంతో గుణశేఖర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన హోం క్వారంటైన్కు వెళ్లారు. కొద్ది రోజుల పాటు శాకుంతలం సినిమాకు బ్రేక్ పడనుండగా, గుణశేఖర్ కోలుకున్నాక తిరిగి చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నారు.