న్యూఢిల్లీ: ఆ రంగంలో ఆ రెండు సంస్థలు ప్రధాన ప్రత్యర్థులు.. కానీ అవసరాల రీత్యా చేతులు కలిపాయి… తత్ఫలితంగా భారత టెలికం రంగంలోనే సంచలనం రికార్డయింది. 4జీ సేవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిలయన్స్ జియో.., తొలి నుంచి దేశీయ టెలికం రంగంలో సేవలందిస్తూ వచ్చిన భారతీ ఎయిర్టెల్ చేతులు కలిపాయి. ఈ మేరకు రెండు సంస్థలు భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి.. అదేంటో ఒకసారి చూద్దామా..!
స్పెక్ట్రం ట్రేడింగ్లో చేయూత కోసం ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో భారతీ ఎయిర్టెల్కు చెందిన 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వాడుకునే హక్కు పొందేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది. ఇందుకోసం ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ ఒప్పందంతో దేశంలోనే అత్యంత జన జమ్మర్థ ప్రాంతాల్లో టెలికం సేవల కోసం స్పెక్ట్రం వాడుకునే సామర్థ్యం రిలయన్స్ జియోకు పెరుగుతుంది. అయితే, ఈ రెండు ప్రధాన సంస్థల మధ్య ఒప్పందానికి రెగ్యులేటరీ అప్రూవల్స్ లభించాల్సి ఉంది. ఈ ఒప్పందం విలువ రమారమీ రూ.1,497 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటికైతే జియో నుంచి ఎయిర్టెల్ రూ.1,037.6 కోట్లు పొందనున్నది.
ఈ స్పెక్ట్రం ట్రేడింగ్ రైట్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ముంబై సర్కిల్లో 800 మెగాహెర్ట్జ్లో 2ఎక్స్15 మెగాహెర్ట్జ్, ఆంధ్రప్రదేశ్& ఢిల్లీ సర్కిళ్లలో 800 మెగాహెర్ట్జ్ బాండ్లో 20ఎక్స్ 10 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వినియోగించుకోవడానికి జియోకు హక్కులు దఖలు పడతాయి. తదుపరి స్పెక్ట్రం వినియోగం మరింత సంఘటిత పడానికి మార్గం సుగమం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్తో బోలెడు బెనిఫిట్లు!
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్