చండీగఢ్: పంజాబ్లోని సిహాంగ్ సిక్కులు పోలీసుల చేతులు నరికారు. తరన్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కత్తులు వంటి ఆయుధాలు ధరించే సిక్కులను నిహాంగులని అంటారు. కాగా, మహారాష్ట్రలోని నాందేడ్లో ఒక హత్య చేసిన ఇద్దరు నిహాంగ్ సిక్కులు, సుర్ సింగ్ గ్రామంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులపై నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో వాల్టోహా పోలీస్ స్టేషన్కు చెందిన అధికారులు నరేంద్ర సింగ్, బల్విందర్ సింగ్ చేతులు తెగాయి. తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ ఇద్దరు నిహాంగ్ సిక్కులు మరణించారు.