న్యూఢిల్లీ, మార్చి 20: లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందించే తమ ప్రభుత్వ పథకానికి ఎలాంటి పేరు పెట్టబోమని.. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ‘ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో ఈ నెల 25న ఈ పథకాన్ని అమలు చేస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించటం, తాము సరఫరా చేసే ఆహారధాన్యాలను మీ పేరుతో ప్రచారం చేసుకోవటమేమిటని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే.