ములుగురూరల్, మార్చి16: క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొం దడంతోపాటు స్నేహభావం పెరుగుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి సెపక్తక్రా బాలబాలికల 7వ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలను మంగ ళవారం కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 10 ఉమ్మడి జిల్లాల నుం చి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త జిల్లాలో కొత్త ఆటను పరిచయం చేయడం అభినందనీయమని అన్నారు. తొలి రోజు నిర్వహించిన క్రీడల్లో నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, అదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, ములుగు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, నేడు సైతం ఈ క్రీడలు నిర్వహించి రాష్ట్రస్థాయికి జట్లను ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్సురభి, ఏఎస్పీ సాయిచైత న్య, సెపక్తక్రా అసోసి యేషన్ నాయకులు ప్రేమ్రాజ్ గోవింద్నాయక్, బానోత్ సమ్మయ్య, శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి, శిరీష్రెడ్డి, జితేందర్నాథ్, రామకృష్ణ, అనిల్కుమార్, పీవీ చారి పాల్గొన్నారు.