లక్నో: భార్యతో జరిగిన గొడవలో వాదించలేక విసుగెత్తిన భర్త ఏకంగా నాలుక కోసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గోపాల్పూర్ గ్రామానికి చెందిన ముఖేష్, అతడి భార్య నిషా మధ్య కుటుంబం విషయమై తరచుగా గొడవ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, ముఖేష్ శనివారం తన భార్యకు ఫోన్ చేశాడు. ఇంటికి తిరిగి రావాలని నిషాను కోరాడు. భార్య తిరస్కరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, వాదన జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ముఖేష్ బ్లేడ్తో తన నాలుక కోసుకున్నాడు. కారుతున్న రక్తంతో బాధతో విలవిలాడుతున్న అతడ్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే ముఖేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కాన్పూర్లోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.