ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని భోజ్పూర్ ఏరియాలో ఒక యువకుడు జుగుప్సాకరమైన చేష్టలకు పాల్పడ్డాడు. ఒక పెండ్లి వేడుకలో రోటీలు తయారుచేసేందుకు వచ్చిన అతడు.. వాటిపై ఉమ్ముతూ కాల్చడం మొదలుపెట్టాడు. ఈ తతాంగాన్నంతా గమనించిన ఓ వ్యక్తి సీక్రెట్గా తన ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు.
ఆ వీడియో వైరల్గా మారడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో ఘజియాబాద్ పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. యువకుడు రోటీలు చేస్తూ ఉమ్ముతున్న దృశ్యాన్ని కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.