హైదరాబాద్ : తాళం వేసిన ఉన్న ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఉదయ్నగర్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి గల కారణంగా పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలు నివాసులు ఈ ఫ్లాట్లో నివసిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొన్ని రోజులక్రితం శ్రీశైలం వెళ్లారు. బహుళ అంతస్థు భవనంలోని మూడో ఫ్లోర్లో మంటలను గుర్తించిన చుట్టుప్రక్కలవారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఓ పెద్ద శబ్దం వినిపించినట్లుగా అది బహుశా సిలిండర్ పేలుడు అయి ఉండొచ్చన్నారు.