రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 11 తేదీన జరిగే మహా శివరాత్రి జాతర సందర్భంగా స్వామి వారికి ఉదయం 8:30 మంత్రులు కేటీఆర్, ఐకేరెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఉదయం 7 గంటలకు శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.