నాగర్కర్నూల్ : సీఎం కేసీఆర్ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
. ఉద్యమంలో వెనకడుగు వేస్తే రాళ్లతో కొట్టి చంపండని ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు చరిత్రలో లేరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సీఎం కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ సాధించుకున్నారు
. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, గురుకులాలు ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర మంత్రులే ఈ పథకాలను ప్రశంసిస్తున్నారని మంత్రి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. వాట్సప్, ఫేస్ బుక్కుల్లో అపనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు
. అలాంటివి నమ్మొద్దన్నారు. ఉద్యోగులకు త్వరలో మంచి పీఆర్సీ వస్తుందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతురాలు
వాణిదేవి సీరియల్ నెంబర్ 4కు 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పద్మావతి, ఎంఎల్సీ దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.