బెంగుళూరు: అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి సుమారు రెండు వేల కోట్ల విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అయోధ్యలో గెస్ట్హౌజ్ నిర్మించేందుకు కర్నాటక ప్రభుత్వం రెఢీ అయ్యింది. దీని కోసం 10 కోట్లు కేటాయించింది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం బీఎస్ యడ్యూరప్ప ఈ విషయాన్ని తెలిపారు. కర్నాటక నిర్మించనున్న గెస్ట్హౌజ్కు అయిదు ఎకరాల స్థలం ఇవ్వనున్నట్లు యూపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. కర్నాటక నుంచి వెళ్లే యాత్రికులకు అయోధ్య గెస్ట్హౌజ్ పనిచేస్తుందని సీఎం యడ్డీ తెలిపారు. ఇప్పటికే తిరుపతిలోనూ యాత్రి నివాస్లను కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే తరహాలో అయోధ్యలోని యాత్రికుల కోసం గెస్ట్ హౌజ్ నిర్మించనున్నారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీరశైవ లింగాయత్ వర్గానికి చెందిన బోర్డుకు 500 కోట్లు కేటాయించారు. వొక్కలింగ కమ్యూనిటీ కోసం 500 కోట్లతో కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. బ్రాహ్మిణ బోర్డుకు 50 కోట్లు కేటాయించారు. మైనార్టీల కోసం 1500 కోట్లు ఖర్చు చేయనున్నారు.