బాలీవుడ్ నటి తాప్సీ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాప్సీ యాడ్ ఎండార్స్ మెంట్, సినిమా ఒప్పందాలపై నిఘా పెట్టిన ఐటీ శాఖ.. తాప్సీ దగ్గర లెక్కల్లో చూపని రూ.5 కోట్లను గుర్తించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాప్సీ బాయ్ఫ్రెండ్ మథియాస్ బోయె కేంద్రక్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కు ఓ రిక్వెస్ట్ చేశాడు. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మథియాస్ ఓ ట్వీట్ చేశాడు.
నేను కొంతమంది గొప్ప అథ్లెట్లకు కోచ్గా తొలిసారిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఐటీ విభాగం తాప్సీ ఇండ్లపై దాడులు ఆమె కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రులపై అనవసర ఒత్తిడి పెంచుతున్నాయి. దయచేసి ఏదైనా చేయండి అంటూ కిరణ్ రిజిజుకు ట్యాగ్ చేశాడు. దీనికి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ..భూమిపై అన్నింటికి ప్రధానమైనది చట్టం. మేము దానికి కట్టుబడి ఉండాలి. ఈ అంశం మీ, నా పరిధిని దాటిపోయింది. భారత క్రీడలను ఉత్తమంగా మెరుగుదిద్దేందుకు మా వృత్తిపరమైన విధులకు కట్టుబడి ఉండాలి.. అని రీట్వీట్ చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.