బోధన్/ఆర్మూర్/నవీపేట/రెంజల్/భీమ్గల్/మాక్లూర్/కోటగిరి/రుద్రూర్/వర్ని/ఇందల్వాయి, ఏప్రిల్ 9: జిల్లా వ్యా ప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృ తంగా కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బోధన్లో వరుసగా రెండో రోజూ కూడా కొవిడ్ పాజిటివ్ కేసులు సెంచరీని దాటాయి. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 106 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపా రు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో నిర్వ హించిన కరోనా ప రీక్షల్లో 75 మందికి పాజిటివ్ వచ్చిందని దవాఖాన సూప రింటెండెంట్ నాగరాజు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ 279 మందికి ఇచ్చినట్లు తెలిపారు. ఆర్మూర్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫస్ట్ డోస్ 233 మందికి, సెకండ్ డోస్ టీకా 23 మందికి వేసినట్లు మెడికల్ ఆఫీసర్ ఆయేషా ఫిర్దోస్, హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్, ఏఎన్ఎం అనురాధ తెలిపారు. నవీపేట పీహెచ్సీ జన్నేపల్లి క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాల్లో 186 టెస్టులు నిర్వహించగా 59 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.
నవీపేట పీహెచ్సీ పరిధిలో 153 మందికి పరీక్షలు నిర్వహించగా 48 మందికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్ దేవేందర్ తెలిపారు. జన్నేపల్లి క్లస్టర్ పరిధిలో 33 మందికి పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు మాక్లూర్ పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఆనంద్ తెలిపారు. రెంజల్ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 222 మందికి పరీక్షలు నిర్వహించగా 57 మందికి పాజిటివ్ వచ్చిందని మం డల వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు. తాడ్బిలోలిలో ప్రారంభమైన సెల్ఫ్ లాక్డౌన్ ఈనెల 25 వరకు కొనసాగుతుందని తహసీల్దార్ రాంచందర్ తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా 16 మంది కి పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ దవాఖాన వైద్యురాలు సుచరిత తెలిపారు. మాక్లూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించగా 38 మందికి పాజిటివ్ వచ్చిం దని వైద్యుడు సంజీవ్రెడ్డి తెలిపారు.
కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరి దవాఖానల్లో కరోనా పరీక్షలు నిర్వహించ గా 19 మందికి పాజిటి వ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్లు సమత, విద్య తెలిపారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 134 మందికి టెస్టులు చేయగా 14 మందికి, కోటగిరి దవాఖా నలో 80 మందికి టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. రుద్రూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి దిలీప్ తెలిపారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాల లో 83మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు వెంకన్న తెలిపారు. ఇందల్వా యిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 65 మందికి పరీక్షలు చేయగా 20 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యుడు శుభాకర్ తెలిపారు.