పిట్లం, ఏప్రిల్ 8 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన గురువారం ప్రారంభించారు. మండలకేంద్రంలోని రైతువేదిక భవనం, తిమ్మానగర్లో రైతువేదిక భవనం, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు, మార్ధండలో వైకుంఠధామం, కారేగాంలో గ్రామపంచాయతీ భవనం, కిష్టాపూర్లో బీటీ రోడ్డు పనులు, రాంపూర్లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు, గౌరారంలో వైకుంఠధామం, మద్దెల చెరువులో రైతువేదిక భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పిట్లం మండలంలోని బీడు భూములు నాగమడుగు నీటితో సాగులోకి రానున్నాయన్నారు. నాగమడుగు మత్తడి పనులను పది రోజుల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి.. ఏడాదిలోగా నీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, విండో చైర్మన్లు శపథంరెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి, సర్పంచులు విజయలక్ష్మి, అనిత, సత్యవ్వ, దుర్గయ్య, నారాయణరెడ్డి, అనసూయ, పండిత్రావు, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, వాసరి రమేశ్, ప్రతాప్రెడ్డి, రజనీకాంత్రెడ్డి, విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, నర్సాగౌడ్, జగదీశ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…