మోర్తాడ్/బాల్కొండ(ముప్కాల్)/ఆర్మూర్/మాక్లూర్/కోటగిరి/ఇందల్వాయి/జక్రాన్పల్లి/వర్ని, ఆగస్టు 4: గ్రామాల్లో కొనసాగుతున్న ఆరోగ్య సర్వేలో కరోనాపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి సూచించారు. మోర్తాడ్ మండలం పాలెంలో కొనసాగుతున్న సర్వేలో బుధవారం ఆయన పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అవగాహన లేకపోవడంతోనే కరోనా వైరస్ పెరుగుతున్నదని, ప్రాథమిక లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్లో ఉండేలా చూ డాలని చెప్పారు. సర్పంచ్ సంతోష్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏఎన్ఎం ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య సర్వే బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో సంతోష్కుమార్ ఉన్నారు. ఆర్మూ ర్ పట్టణంలోని 36 వార్డులతోపాటు మండలంలోని 18 గ్రామాల్లో హెల్త్ వీక్ సర్వే బుధవారం కొనసాగింది. హెల్త్వీక్ సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇం టింటికీ వెళ్లి వ్యాధుల వివరాలను నమోదు చేసుకున్నారు. ఆర్మూర్లో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, ఎంపీపీ న ర్సయ్య, జడ్పీటీసీ సంతోష్ ఆరోగ్య సర్వేను పరిశీలించి వైద్యులకు, ప్రజలకు సూచనలు చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ రమేశ్, నాగరాజు, ఆయేషా ఫిర్దోస్, భాస్కర్రావు, స్వా తి వినూత్న, హెల్త్ సూపర్వైజర్లు చంద్రశేఖర్, అనురాధ, అర్గుల్ సుభాష్ పాల్గొన్నారు. మాక్లూర్ మండలం బొంకన్ పల్లి, ముల్లంగి(బీ) గ్రామాల్లో నిర్వహించిన ఆరోగ్య సర్వేను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. కోటగిరి మండలం దోమలెడ్గిలో ఏఎన్ఎంలు గంగామణి, సవిత, ఆశ కార్యకర్తలు కరు ణ, అంగన్వాడీ కార్యకర్త స్వరూప సర్వే చేపట్టగా.. సర్పంచ్ అనంత జయరాణీ పర్యవేక్షించారు. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి శంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే నిర్వహించారు. ఆరో గ్య కార్యకర్త మమత, ఆశ కార్యకర్తలు అనూష, సుమలత, సుభద్ర, అంగన్వాడీ కార్యకర్తలు స్వరూప, రజిత పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలంలో ఆరోగ్య సర్వే ప్రారంభమైంది. ఎంపీపీ హరిత సర్వేను పర్యవేక్షించారు. ప్రజలు అధికారులకు సహకరించి వివరాలను అందజేయాలని సూచించారు. ఎంపీడీవో లక్ష్మణ్, సర్వే సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్ని మం డలం సత్యనారాయణపురం, పాత వర్ని, హుమ్నాపూర్ తదితర గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, వైద్య, పంచాయతీ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. సత్యనారాయణపురంలో చేపట్టిన సర్వేను ఎంపీడీవో బషీరుద్ద్దీన్ పర్యవేక్షించారు.