గాంధారి/పిట్లం/మద్నూర్/నిజాంసాగర్/బిచ్కుంద, జనవరి 4 : జిల్లాలో 15 నుంచి18 ఏండ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గాంధారి మండలంలో మంగళవారం 432 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో 115 మంది టీనేజర్లతోపాటు 27 మందికి ఫస్ట్ డోస్, 290 మందికి సెకండ్ డోస్ టీకాలు వేశామని తెలిపారు. పిట్లం ప్రభుత్వ దవాఖానలో టీనేజర్లకు వైద్యాధికారి శివకుమార్ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. కార్యక్రమంలో జ్యోతిబా ఫూలే గురుకులం ప్రిన్సిపాల్ రబ్బానీ, కేజీబీవీ ప్రిన్సిపాల్ సరిత, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయేందర్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ మాణిక్యమ్మ, నాయకులు పాల్గొన్నారు.
మద్నూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీనేజర్లకు టీకాల పంపిణీని సర్పంచ్ దరాస్ సురేశ్ మంగళవారం ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరూ టీకాలు వేసుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ విఠల్, ఎంపీటీసీ సంగీత, డాక్టర్ ఆనంద్జాదవ్, నాయకులు కుషాల్, గోపి, హన్మాండ్లు, బలిరాం, జ్ఞానేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని కళాశాలతోపాటు గురుకుల పాఠశాల విద్యార్థులకు టీకాలు వేశారు. 15 నుంచి 18 ఏండ్లు ఉన్నవారికి టీకాలు వేస్తున్నామని మండల వైద్యాధికారి శరత్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నళిని పాల్గొన్నారు. బిచ్కుంద మండలంలో 15 సంవత్సరాలు నిండిని వివిధ పాఠశాలల విద్యార్థులకు టీకాలు వేశారు. బీర్కూర్ పీహెచ్సీలో టీనేజర్లకు టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి రాజా రమేశ్ తెలిపారు. నస్రుల్లాబాద్ మండలంలోని ఎస్సీ హాస్టల్ పిల్లలకు వ్యాక్సిన్ వేశామని చెప్పారు.