నవీపేట్లో వంద మందికి జ్వరం
ప్రత్యేక శిబిరం ఏర్పాటు
రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది
అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
నవీపేట,జూలై 31: నవీపేట మండల కేంద్రంలో పలువురు వైరల్ ఫీవర్బారిన పడ్డారు. స్థానిక బహుదూర్పుర కాలనీలో వందమంది జ్వరం బారిన పడడంతో వైద్య సిబ్బంది స్పందించారు. వెంటనే కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, జిల్లా వైద్యాధికారి సుదర్శనం అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రక్తనమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. వైరల్ ఫీవర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. దోమల మందును పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే పీహెచ్సీ, సీహెచ్సీలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాలనీలో 15 మందికి వైరల్ జ్వరాలు రాగా, మందులను పంపిణీ చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. శిబిరంలో వైద్యాధికారి తరుణం నాజ్,హెల్త్ సూపర్ వైజర్లు దేవేందర్, కిషన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.