మల్హర్ :మండలంలోని పలు అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ (జడ్పీ) సీఈవో శోభారాణి పరిశీలించారు. మండలంలోని అన్సాన్పల్లి, నాచారం గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి పనులు, వ్యాక్సినేషన్, నర్సరీల పనులను పర్యవేక్షించారు. ఈ కార్యకమంలో సర్పంచ్ గగులోతు జగన్, ఎంపీడీవో నర్సింహామూర్తి, కార్యదర్శి వెన్నెల, టీఏ రమేశ్, అంగన్వాడీ టీచర్, కారోబార్ సిబ్బంది ఉన్నారు.