నర్సంపేట, ఏప్రిల్ 12 : పట్టణంలోని కిరాణా వర్తక సంఘం నాయకులు సోమవారం దబ్బవాగు వద్ద పూజలు చేశారు. పాకాల, రంగాయప్రాజెక్టులకు గోదావరి జలాలు వస్తుండడంతో వర్తక సంఘం ఆధ్వర్యంలో పూజలు చేశారు. రైతులకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి నర్సంపేట ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఏండ్ల చరిత్ర కలిగిన పాకాల సరస్సులోకి గోదావరి జలాలు రావడంతో ఈ ప్రాంతం పచ్చని పంటలతో కలకలలాడనుందని అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు దాసరి నర్సింహారెడ్డి, పుట్ట రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
పెద్దికి సన్మానం
చెన్నారావుపేట : గోదావరి జలాలను పాకాల చెరువులోకి తెప్పించిన అపర భగీరథుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అని రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు సోమవారం వారు ఎమ్మెల్యే పెద్దిని మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయ ఆవరణలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గోదావరి జలాలను పాకాల సరస్సులోకి మళ్లించడంతో చెన్నారావుపేట, పాత ముగ్దుంపురం, జోజిపేట, తిమ్మరాయినిపహాడ్, ధర్మాతండా, పాపయ్యపేట, అమృతండా, బోజెర్వు, పుల్లయ్యబోడుతండా గ్రా మాలు సస్యశ్యామలం అవుతాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ తూటి శ్రీను, మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, కేతిడి వీరారెడ్డి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, కంది కృష్ణచైతన్యరెడ్డి, అడుప రమేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్, పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం
ఖానాపురం : పాకాలకు గోదావరి జలాల రాకతో ప్రతి ఒక్కరికీ చేతినిండా ఉపాధి దొరుకుతుందని టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. పాకాలకు గోదావరి జలాలు తీసుకొచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ కేవీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రూ.330 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు ఉపయోగపడేలా జలాలు తీసుసుకొచ్చిన పెద్దికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హమాలీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ, పాలడుగుల రమేశ్, మండల బాధ్యులు షేక్ అల్లావుద్దీన్, పోతరాజు కుమారస్వామి, నర్సయ్య, వెంకటేశ్వర్లు, సారయ్య, సంపత్, మైనొద్దీన్ పాల్గొన్నారు.
పెద్దికి ఘన సన్మానం
ఖానాపురం : పాకాలకు గోదావరి జలాలు తీసుకొచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని క్యాంప్ కార్యాలయ ఆవరణలో బుధరావుపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, రైతులు ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య మాట్లాడుతూ ఈ ప్రాం త రైతులకు ఎంతో మేలు జరుగనుందన్నారు. బుధరావుపేట ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీకి విత్తన ఉత్పత్తి ప్రాసెసింగ్ చేయడానికి రూ.60 లక్షలు మంజూరు చేయంచడంపై కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, ఎంపీటీసీలు షేక్ సుబాన్బీ, మౌలానా, బిక్కి లింగమ్మ, మురళి, జైపాల్రెడ్డి, పొడుపుగంటి మధు, వల్లెపు కుమార్, ఎర్రబెల్లి మల్లయ్య, బండి ప్రభాకర్, పసునూరి వెంకన్న, తండా వీరన్న పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆంగ్ సాన్ సూకీపై కొత్త క్రిమినల్ కేసు నమోదు
కుక్కర్ బాంబును నిర్వీర్యం చేసిన ఐటీబీపీ