వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్
రాయపర్తి, జూలై 17: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్ తెలిపారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు కిష్టాపురం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును శనివారం ఆయన వర్ధన్నపేట సీఐ సదన్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిలో వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి వాహనదారుడు విధిగా సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డ్రైవర్లు యూనిఫాం ధరించాలన్నా రు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుం టే జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు అబ్దుల్ రహీం, వంశీకృష్ణ, ఏఎస్సై యాదయ్య, సిబ్బంది సురేశ్, ఎడ్ల రవీందర్, చిదురాల రమేశ్, తూళ్ల సంపత్, బొట్ల రాజు, గొళ్లెన రమేశ్, అవినాశ్, మహేందర్, కత్తుల శ్రీనివాస్, చొల్లేటి హర్షిత, మమత, పూర్ణచందర్రెడ్డి, సోమ్లానాయక్ పాల్గొన్నారు.
పెండింగ్ చలాన్లు చెల్లించాలి
పర్వతగిరి: వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించాలని మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ సూచించారు. మండలకేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనాలను గుర్తించి వసూలు చేసినట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, ఎస్సై నవీన్కుమార్, సంగెం ఎస్సై భాస్కర్రెడ్డి, ఐనవోలు ఎస్సై భరత్, శిక్షణ ఎస్సైలు పాల్గొన్నారు.
తీగరాజుపల్లిలో వాహన తనిఖీలు
సంగెం: తీగరాజుపల్లి కూడలిలో శనివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్సై భాస్కర్రెడ్డి, ప్రొబేషనరీ ఎస్సై ప్రియదర్శిని ఆధ్వర్యంలో నెక్కొండ-వరంగల్ ప్రధాన రహదారిలోని తీగరాజుపల్లిలో వాహనాలను ఆపి పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. వాహనచోదకులు విధిగా నిబంధనలు పాటించాలని కోరారు.