జయశంకర్ భూపాలపల్లి : బొగ్గు రవాణా చేయడానికి భూపాలపల్లి లారీ ఓనర్ అసోసియేషన్ వారు తన లారీకి సీరియల్ ఇవ్వడం లేదని లారీ ఓనర్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ సృష్టించాడు. వివరాల్లోకి వెళ్తే..భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖాసింపల్లి గ్రామానికి చెందిన లారీ ఓనర్ చిత్తారి రాకేష్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. అతని దింపడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.