జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు వరలక్ష్మి వ్రతాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అలాగే కొంతమంది భక్తులు స్వామి వారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.