కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామునుంచే భక్తులు త్రివేణి సంగమం గోదావరి తీరం లో స్నానాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించి, సైకత శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం లో శని, కాలసర్పదోష నివారణ పూజలు జరిపారు.
ఈ సందర్భంగా శుభనందదేవి (పార్వతి అమ్మవారు)ఆలయంలో కుంకుమ అర్చన చేశారు. అర్చకులు భక్తులకు కార్తీక మాసం గురించి వివరించారు. ఆలయంలోని తులసీ, మారేడు చెట్టుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, కార్తీక దీపాలు వెలిగించారు.