జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ సాధనలో సార్ సేవలు మరువలేనివన్నారు. జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ ఆలోచనలు, ఆశయాల కనుగుణంగా అన్ని వర్గాల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి