జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని రేగొండ మండల కేంద్రం లో టీఆర్ఎస్ యూత్ రేగొండ మండల అధ్యక్షుడు పేరాల ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి గండ్ర సత్యనారాయణపై చేసిన తప్పుడు విమర్శలను ఖండించారు. టీఆర్ఎస్ నేతలను జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.