జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రముఖ సినీ హీరో ఆర్ నారాయణ మూర్తి తీసిన రైతన్న సినిమాను జిల్లా కేంద్రంలోని ఊర్వశి థియోటర్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమ స్ఫూర్తితో నిర్మించిన రైతన్న సినిమాను ఆదరించాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నల్ల చట్టాలతో వ్యవసాయ రంగం కుదేలవుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.