భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గా ఎం.రఘువరన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 గ్రూప్-1బ్యాచ్కు చెందిన రఘువరన్ కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశారు. అయితే ప్రభుత్వం ఆయనను పదోన్నతిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్కు డిప్యూటీ సీఈఓగా బదిలీ చేసింది. ఈ సందర్భంగా ఆయన జడ్పీ సీఈఓ శోభారాణి ని మర్యాద పూర్వకంగా కలిశారు.