జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం, చెల్పూరు గ్రామంలో గల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో నూతనంగా జెన్కో కార్మికుల సౌకర్యార్థం నిర్మించిన 430 క్వార్టర్స్ను టీఎస్ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు ప్రారంభించారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి మొక్కలను నాటారు. వారి వెంట జెన్కో డైరెక్టర్లు, కేటీపీపీ సీఈ సిద్దయ్య, కేటీపీపీ అధికారులు, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.