జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఇండో- అమెరికన్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 12 ఐసీయూ బెడ్లు, పరికరాలు అమర్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఐసీయూ పడకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ పడకలు, పరికరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకొచ్చి సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.