హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి ఎగువ నుంచి వరద వస్తుండటంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు 55 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు బ్యారేజీ 10 గేట్లను ఎత్తి 23,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు