గణపురం : గణపురం మండల కేంద్రంలోని కాకతీయుల కళక్షేత్రం భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో వరంగల్ డీఎంహెచ్వో డాక్డర్ లలితాదేవి రాజేశ్వరప్రసాద్ దంపతులు కార్తీకమాస పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న గోమాతలకు పండ్లను అందజేశారు.
దంపతులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయ పరీరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు.